కరోనా భయంతో మూడు నగరాల్లో మెట్రోరైలు సర్వీసుల బంద్
ABN , First Publish Date - 2020-03-21T12:11:30+05:30 IST
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం మూడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో మెట్రోరైలు సర్వీసులను మూసివేయాలని నిర్ణయించారు.....
![కరోనా భయంతో మూడు నగరాల్లో మెట్రోరైలు సర్వీసుల బంద్](https://media.andhrajyothy.com/appimg/galleries/202003210603598/03212020064112n5.jpg)
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం మూడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో మెట్రోరైలు సర్వీసులను మూసివేయాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 22వతేదీన జైపూర్ నగరంలో మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు జైపూర్ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేర ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు ప్రకటించారు.జనతా కర్ఫ్యూ సందర్భంగా నోయిడా నగరంలో మెట్రో, సిటీ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు నోయిడా అథారిటీ సీఈవో రితూ మహేశ్వరి చెప్పారు.