భారతీయ రైల్వేపై కోర్టుకెక్కిన చైనా కంపెనీ

ABN , First Publish Date - 2020-07-18T20:00:31+05:30 IST

ఇటీవల రూ.470 కోట్ల రైల్వే సిగ్నలింగ్ కాంట్రాక్టు నుంచి తమను తప్పించడంపై చైనా ఇంజినీరింగ్ కంపెనీ భారతీయ రైల్వేపై ఢిల్లీ కోర్టులో..

భారతీయ రైల్వేపై కోర్టుకెక్కిన చైనా కంపెనీ

న్యూఢిల్లీ: ఇటీవల రూ.470 కోట్ల రైల్వే సిగ్నలింగ్ కాంట్రాక్టు నుంచి తమను తప్పించడంపై చైనా ఇంజినీరింగ్ కంపెనీ భారతీయ రైల్వేపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారత రైల్వేకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) తమ బ్యాంకు గ్యారంటీని సొమ్ముచేసుకోకుండా అడ్డుకోవాలంటూ చైనా కంపెనీ అభ్యర్ధించింది. నాలుగేళ్ల నుంచి చైనా కంపెనీ కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేసిందనీ.. పనుల్లో తీవ్ర అలసత్వం చూపుతున్నందున ఈ కాంట్రాక్టు నుంచి తప్పిస్తున్నామని డీఎఫ్‌సీసీఐఎల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాన్పూర్ దీనదయాళ్ సెక్షన్‌కు సంబంధించి 417 కిలోమీటర్ల మేర సిగ్నల్స్ వ్యవస్థ పూర్తికై  2016లో ఈ  ఒప్పందం కుదిరింది.

Updated Date - 2020-07-18T20:00:31+05:30 IST