ఆప్టికల్ ఫైబర్స్పై ఐదేళ్లు సుంకాలు: చైనా
ABN , First Publish Date - 2020-08-14T06:55:06+05:30 IST
భారత్ నుంచి దిగుమతయ్యే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్స్పై యాంటీ డంపింగ్ సుంకాలను మరో ఐదేళ్లు పొడిగిస్తూ చైనా గురువారం నిర్ణయం తీసుకుంది...
బీజింగ్, ఆగస్టు 13: భారత్ నుంచి దిగుమతయ్యే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్స్పై యాంటీ డంపింగ్ సుంకాలను మరో ఐదేళ్లు పొడిగిస్తూ చైనా గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత తయారీదారులను బట్టి సుంకాల శ్రేణి 7.4 శాతం నుంచి 30.6 శాతం వరకు ఉండనుంది. తమ ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం చైనాకు చెందిన ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం నిలిపివేశాయి.