ఎవరెస్టుపై చైనా బృందం సర్వే

ABN , First Publish Date - 2020-05-18T08:56:56+05:30 IST

చైనాకు చెందిన ఓ సర్వే బృందం ఎవరెస్టు శిఖరం ఎక్కనుంది. కరోనా నేపథ్యంలో అక్కడికి పర్యాటకులు, పర్వతారోహకులను అనుమతించట్లేదు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓ బృందం ఎవరెస్టు...

ఎవరెస్టుపై చైనా బృందం సర్వే

బీజింగ్‌, మే 17: చైనాకు చెందిన ఓ సర్వే బృందం ఎవరెస్టు శిఖరం ఎక్కనుంది. కరోనా నేపథ్యంలో అక్కడికి పర్యాటకులు, పర్వతారోహకులను అనుమతించట్లేదు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓ బృందం ఎవరెస్టు ఎత్తు, మారుతున్న వాతావరణం, అక్కడి సహజ వనరులు వంటి అంశాలపై సర్వే చేయనుంది. ఆ బృందం శుక్రవారం ఉదయం నాటికి ఎవరెస్టును అధిరోహించే అవకాశం ఉంది. చైనా ఇప్పటివరకు ఎవరెస్టుపై ఆరు కీలక సర్వేలు చేపట్టింది. 1975లో చైనా చేపట్టిన సర్వేలో ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లుగా, 2005లో చేపట్టిన సర్వేలో 8,844 మీటర్లుగా తేలింది. 


Updated Date - 2020-05-18T08:56:56+05:30 IST