కరోనా సమాచారాన్ని చైనా ఇంకా దాస్తూనే ఉంది: యూఎస్

ABN , First Publish Date - 2020-05-09T23:36:57+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఇంకా దాస్తూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది.

కరోనా సమాచారాన్ని చైనా ఇంకా దాస్తూనే ఉంది: యూఎస్

వాషింగ్టన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఇంకా దాస్తూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాపై యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో విమర్శలు గుప్పించారు. ‘చైనా ఇంకా కరోనా సమాచారాన్ని దాస్తూనే ఉంది. తద్వారా ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది’ అని ఆయన విమర్శించారు. వూహాన్‌లోని ఓ ల్యాబొరేటరీ సరిగా పనిచేయడంలేదని ఆరోపణలు ఎదుర్కొందని, బహుశా కరోనా వైరస్ దాన్నుంచే వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-09T23:36:57+05:30 IST