వంతెనను పేల్చేసిన చైనా.. వరద ఉధృతి తగ్గించేందుకే..

ABN , First Publish Date - 2020-07-21T02:53:32+05:30 IST

భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ...

వంతెనను పేల్చేసిన చైనా.. వరద ఉధృతి తగ్గించేందుకే..

బీజింగ్: భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాద స్థాయిదాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో యాంగ్జీ నది ఉపనదైన చూహే నదిపై ఉన్న వంతెనను చైనా ప్రభుత్వం కూల్చేసింది. వరద ఉధృతిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి దాదాపు పదుల సంఖ్యలో మృతిచెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు.

Updated Date - 2020-07-21T02:53:32+05:30 IST