‘కూటమి పార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు’

ABN , First Publish Date - 2020-12-29T15:28:16+05:30 IST

కూటమి పార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని రాష్ట్రప్రజలు అంగీకరించరని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం సోమవారం సాయంత్రం

‘కూటమి పార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు’

చెన్నై : కూటమి పార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని రాష్ట్రప్రజలు అంగీకరించరని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం సోమవారం సాయంత్రం చెన్నై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లిన సీఎం కోవై విమానాశ్రయంలో  మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమంటూ ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తుందని, రాష్ట్రంలో అవినీతికి పాల్పడే పార్టీ డీఎంకే అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆస్తులు వెల్లడించేందుకు తాను సిద్ధమని, స్టాలిన్‌ కూడా సిద్ధమా అంటూ సీఎం సవాలు విసిరారు. అన్నాడీఎంకే పాలనలో ఎలాంటి వంతెనలు నిర్మించలేదని చెన్నై మాజీ మేయర్‌, ఎమ్మెల్యే సుబ్రమణ్యం ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనలో 86 వంతెనలు నిర్మించామన్నారు.  

Updated Date - 2020-12-29T15:28:16+05:30 IST