జాదవ్‌ కోసం చట్టాలను మార్చం: పాకిస్థాన్‌

ABN , First Publish Date - 2020-09-12T07:54:37+05:30 IST

ఉరి శిక్ష పడిన భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌ తరఫున వాదించేందుకు భారత న్యాయవాదులను అనుమతించే ప్రసక్తి లేదని పాకిస్థాన్‌ గురువారం స్పష్టం చేసింది.

జాదవ్‌ కోసం చట్టాలను మార్చం: పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 11: ఉరి శిక్ష పడిన భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌ తరఫున వాదించేందుకు భారత న్యాయవాదులను అనుమతించే ప్రసక్తి లేదని పాకిస్థాన్‌ గురువారం స్పష్టం చేసింది. విదేశీ లాయర్లను తమ కోర్టులలో అనుమతించేందుకు వీలుగా దేశంలోని చట్టాలను సవరించబోమ ని పాకిస్థాన్‌ తెలిపింది. పాకిస్థాన్‌లోని కొన్ని పత్రికలు దీనికి సంబంధించిన వార్తలు ప్రచురించాయి. గూఢచర్యం ఆరోపణల కేసులో జాదవ్‌కు పాకిస్థాన్‌లోని సైనిక కోర్టు మరణ శిక్షను విధించింది. అయితే దీనిపై భారత్‌ హేగ్‌లో ని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించగా, శిక్ష అమలుపై స్టే ఇచ్చింది. కాగా, జాదవ్‌ విషయం దౌత్యమార్గాల ద్వారా పాకిస్థాన్‌ను సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

Updated Date - 2020-09-12T07:54:37+05:30 IST