రండి బాబూ రండి.. ఉల్లి కిలో 26.. కేంద్రం ఆఫర్
ABN , First Publish Date - 2020-10-24T08:44:37+05:30 IST
ఉల్లి ధరలను నేలకు దించడానికి కేంద్రం ఓ ఆఫర్తో ముందుకొచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తీసుకెళ్లొచ్చని తెలిపింది...
న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఉల్లి ధరలను నేలకు దించడానికి కేంద్రం ఓ ఆఫర్తో ముందుకొచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తీసుకెళ్లొచ్చని తెలిపింది. కిలోకు రూ.26-28 చొప్పున ధర చెల్లించాల్సి ఉంటుందని, రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలని పేర్కొంది. కాగా, ఉల్లి నిల్వపై కేంద్రం డిసెంబరు 31 వరకు పరిమితి విధించింది. హోల్సేలర్ల వద్ద 25టన్నులు, రిటైలర్ల వద్ద 2టన్నులకు మించి నిల్వ ఉండరాదని పేర్కొంది.