సీబీఎస్ఈ ఫలితాలు వచ్చే నెలలో
ABN , First Publish Date - 2020-06-26T19:30:09+05:30 IST
సీబీఎస్ఈ ఫలితాలను జులై నెలలో విడుదల చేస్తామని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని కోర్టుకు తెలిపింది. పది, పన్నెండవ తరగతుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
![సీబీఎస్ఈ ఫలితాలు వచ్చే నెలలో](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062601572738/06262020135939n66.jpg)
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ ఫలితాలను జులై నెలలో విడుదల చేస్తామని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని కోర్టుకు తెలిపింది. పది, పన్నెండవ తరగతుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇక విద్యార్ధులకు మార్కులను కేటాయించే విధానాన్ని కూడా కోర్టుకు వెల్లడించింది. సీబీఎస్ఈ పరిక్షలకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.