‘తబ్లీగీ’పై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభం
ABN , First Publish Date - 2020-05-30T08:49:19+05:30 IST
చట్టవిరుద్ధంగా నగదు లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై తబ్లీగీ జమాత్ నిర్వాహకులపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును
![‘తబ్లీగీ’పై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ, మే 29: చట్టవిరుద్ధంగా నగదు లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై తబ్లీగీ జమాత్ నిర్వాహకులపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ మార్గాల ద్వారా తబ్లీగీ నిర్వాహకులు నగదు కార్యకలాపాలు నిర్వహించారని, విదేశాల నుంచి పొందిన నగదు వివరాలను అధికారులకు తెలపకుండా దాచి ఉంచారంటూ దాఖలైన ఫిర్యాదు ఆధారం గా దర్యాప్తును ప్రారంభించామని సీబీఐ అధికారులు తెలిపారు.