రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స!
ABN , First Publish Date - 2020-07-01T08:19:08+05:30 IST
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో క్షతగాత్రుడికి గరిష్ఠంగా రూ.2.5 లక్షలదాకా నగదురహిత చికిత్సకు అవకాశముంటుంది...
- కేంద్రం కొత్త పథకం, ఒక్కొక్కరికి 2.5 లక్షలదాకా వ్యయం
న్యూఢిల్లీ, జూన్ 30: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో క్షతగాత్రుడికి గరిష్ఠంగా రూ.2.5 లక్షలదాకా నగదురహిత చికిత్సకు అవకాశముంటుంది. కేంద్ర రవాణా, హైవేల శాఖ అన్ని రాష్ట్రాల రవాణా కార్యదర్శులకు ఈ మేరకు ఒక లేఖ రాసింది. భారత్లో ఏటా సుమారు 5 లక్షలదాకా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతుండగా, 3 లక్షలమంది గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స పథకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పథకం అమలుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తన నియంత్ర ణ కింద మోటారు వాహనాల ప్రమాదాల నిధిని ఏర్పాటు చేస్తుంది.