జాతి విద్వేష పోస్టులు పెట్టి.. జైలుపాలై..
ABN , First Publish Date - 2020-04-21T10:23:30+05:30 IST
సోషల్ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై

కశ్మీర్లో మహిళా ఫొటో జర్నలిస్టుపై కేసు
శ్రీనగర్, ఏప్రిల్ 20: సోషల్ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ఫేస్బుక్లో పోస్టులు చేసిన మస్రత్ జహ్రా(26) అనే ఫొటో జర్మలిస్టును న్యాయవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు జమ్మూ, కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.