యాభై వేల కొత్త ఉద్యోగాలు... డిపెంబరు నాటికి ఉపాధి

ABN , First Publish Date - 2020-08-20T20:53:51+05:30 IST

నిరుద్యోగులకు ఊరట. కొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 50 వేల మందికి ఉపాధి కలగనుంది. కరోనా నేపధ్యంలో ఇప్పటికే ఇబ్బందులనెదుర్కొంటున్న వారికి ఒకింత ఊరట కలగనుంది. కాగా కొత్త ఉద్యోగాల్లో అధిక భాగం... స్మార్ట్‌ఫోన్ విభాగంలోనే ఉండనుండడం గమనార్హం.

యాభై వేల కొత్త ఉద్యోగాలు... డిపెంబరు నాటికి ఉపాధి

న్యూఢిల్లీ : నిరుద్యోగులకు ఊరట. కొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 50 వేల మందికి ఉపాధి కలగనుంది. కరోనా నేపధ్యంలో ఇప్పటికే ఇబ్బందులనెదుర్కొంటున్న వారికి ఈ క్రమంలో ఒకింత ఊరట కలగనుంది. కాగా కొత్త ఉద్యోగాల్లో అధిక భాగం... స్మార్ట్‌ఫోన్ విభాగంలోనే ఉండనుండడం గమనార్హం. 


కరోనా వైరస్ నేపధ్యంలో... ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో కోత పడ్డ విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ కూడా చతికిలపడింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నిరుద్యోగులకు తీపికబురు అందింది. కేంద్ర ప్రభుత్వం... వివిధ రంగాల్లో తయారీని, ఉత్పాదకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేలాదిఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.


స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో డిసెంబర్ చివరి నాటికి 50 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని అంచనా. దేశీ, అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు(ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, శాంసంగ్, డిక్సన్, లావా వంటివి) దేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.


ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) స్కీమ్ కింద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశంలో తయారీని పెంచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో... రానున్న రోజుల్లో చాలా మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెంచడం కోసం మోదీ సర్కార్ 2020 ఏప్రిల్ 1 న పీఎల్‌ఐ స్కీమ్ తీసుకువచ్చింది.


ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రో మాట్లాడుతూ... మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ‌లో 1,100 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించారు. దీనివల్ల దేశీ అవసరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని వివరించారు. మొత్తంమీద ఈ క్రమంలో... డిసెంబర్ నాటికి ప్రత్యేక్షంగానే 50 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

Updated Date - 2020-08-20T20:53:51+05:30 IST