రైళ్లలో బయోటాయిలెట్లపై బిజినెస్ స్కూళ్లలో పాఠాలు
ABN , First Publish Date - 2020-11-23T07:52:26+05:30 IST
రైల్వే బోగీల్లోని బయోటాయ్లెట్లపై బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ తరగతి గదుల్లో పాఠాలు బోధించనున్నారు. బయోటాయ్ లెట్ల అభివృద్ధి, వాటిని బోగీల్లో ఏర్పాటు చేయడాన్ని (ఇన్స్టలేషన్) విద్యార్థులు కేస్ స్టడీగా...
న్యూఢిల్లీ, నవంబరు 22: రైల్వే బోగీల్లోని బయోటాయ్లెట్లపై బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ తరగతి గదుల్లో పాఠాలు బోధించనున్నారు. బయోటాయ్ లెట్ల అభివృద్ధి, వాటిని బోగీల్లో ఏర్పాటు చేయడాన్ని (ఇన్స్టలేషన్) విద్యార్థులు కేస్ స్టడీగా తీసుకొని అధ్యయనం చేస్తారు. బయోటాయ్లెట్లపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎ్సబీ) అధ్యయనాన్ని బిజినెస్ స్కూళ్లకు పాఠ్యాంశంగా ఉపయోగించేందు కు అనుమతి ఇచ్చామనిరైల్వే శాఖ తెలిపింది.