బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులు : బీజేపీ ఎంపీ ఫైర్
ABN , First Publish Date - 2020-08-11T21:28:50+05:30 IST
భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులపై బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే

బెంగళూరు : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులపై బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులని తీవ్రంగా ధ్వజమెత్తారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను పైకి తేవడానికి ఏమాత్రం ఇష్టపడని ద్రోహులని విరుచుకుపడ్డారు. అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు.