మేఘాలయలో మరో 26 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా
ABN , First Publish Date - 2020-07-10T22:58:22+05:30 IST
మేఘాలయలో మరో 26 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా

షిల్లాంగ్: కరోనా నివారణకు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయలో మరో 26 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో సరిహద్దు-రక్షణ దళంలో అంటువ్యాధుల సంఖ్య 91కి చేరిందని ముఖ్యమంత్రి కె. సంగ్మా శుక్రవారం తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బందిలో మరి కొంత మందికి పరీక్షలు నిర్వహిస్తామని సీనియర్ ఆరోగ్య అధికారి తెలిపారు.