అక్కడ 3 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-01T23:23:06+05:30 IST
అక్కడ 3 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేరకు కరోనా కేసులు తగ్గినప్పటికీ.. రాష్ట్రంలో అడపాదడపా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు బీఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రారంభించిన 244 ఉచిత కోవిడ్ -19 పరీక్షా కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించినప్పటి నుంచి లక్ష మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా పరీక్షించుకున్నారు. వీరిలో 3 శాతం మందికి కోవిడ్ కేసులు నమోదైనట్లు బీఎంసీ పేర్కొంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 91,000 మందికి పైగా కరోనా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.