కమలానికి మాజీ మంత్రి గుడ్బై... కాంగ్రెస్లో చేరిక
ABN , First Publish Date - 2020-06-05T20:24:34+05:30 IST
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత బాలేందు శుక్లా శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సమక్షంలో..
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత బాలేందు శుక్లా శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై కమల్నాథ్ మాట్లాడుతూ, బాలేంద్ర శుక్లా కాంగ్రెస్లో చేరానని, గతంలో కాంగ్రెస్ను వీడడానికి కారణాలు ఏవైనప్పటికీ తిరిగి ఆయన సొంతింటికి వచ్చారని చెప్పారు. మరి కొంత మంది కూడా కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు.
బాలేందు శుక్లా 2009లో జ్యోతిరాదిత్య సింధియాతో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. ఇటీవలే బీజేపీలో చేరారు. అయితే సింధియా సైతం బీజేపీలోకి రావడంతో శుక్లా ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. శుక్లా పునరాగమనం రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సింధియా గుడ్బై చెప్పడం, ఆయనకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.