పిడుగుల కారణంగా 83 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ABN , First Publish Date - 2020-06-26T04:02:43+05:30 IST
పాట్నా: పిడుగుల కారణంగా బీహార్లో రెండు రోజుల్లో 83 మంది చనిపోయారు. 20 మంది గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఉంది.

పాట్నా: పిడుగుల కారణంగా బీహార్లో రెండు రోజుల్లో 83 మంది చనిపోయారు. 20 మంది గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఉంది. పిడుగుల కారణంగా పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఒక్క గోపాల్గంజ్లోనే 13 మంది చనిపోయారు. మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. జనం ఇళ్లకే పరిమితం కావాలని సీఎం సూచించారు.
పిడుగుపాటు కారణంగా బీహార్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
పిడుగుపాటుకు ఉత్తరప్రదేశ్లోనూ 24 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు.