మోదీ ర్యాలీలపై సినీనటుడు శత్రుఘన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-25T13:57:12+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయ ర్యాలీలపై ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు శత్రుఘన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు...

మోదీ ర్యాలీలపై సినీనటుడు శత్రుఘన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

బీహార్‌లో మోదీ ర్యాలీలు పేలవంగా మారాయి...

పట్నా (బీహార్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయ ర్యాలీలపై ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు శత్రుఘన్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి బీహార్ ప్రజల మద్ధతు లేదని, అందుకే మోదీ రాజకీయ ర్యాలీలు పేలవంగా మారాయని శత్రుఘన్ సిన్హా వ్యాఖ్యానించారు.‘‘ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు... అది జరుగుతున్నట్లు నేను చూస్తున్నాను. ప్రధాని మోదీ పర్యటన పేలవమైనది అతనికి ప్రజల మద్దతు లేదు, మోదీ బీహారులో చైనా గురించి  మాట్లాడుతున్నారని,  బీహారులో మోదీ పేదరికం, నిరుద్యోగం, తక్కువ తలసరి ఆదాయం గురించి ఎందుకు మాట్లాడరు. చాలా మంది వలసకార్మికులు కాలినడకన వచ్చి చాలా బాధపడ్డారు. వలసలకు సంబంధించి తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం పేర్కొంది ’’అని శత్రుఘన్ సిన్హా అన్నారు.


మహాఘటబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ నాయకత్వ సామర్ధ్యాన్ని సిన్హా ప్రశంసించారు. తేజస్వీయాదవ్ నాయకత్వం బలంగా ఉందని, తాను కూడా మద్ధతు ఇచ్చానని పేర్కొన్నారు. శత్రుఘన్ సిన్హా కుమారుడు లవ్ సిన్హా పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీకి కంచు  కోటగా పరిగణిస్తున్న బంకీపూర్ నుంచి  బీజేపీకి చెందిన నితిన్ నవీన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లవ్ సిన్హాపై నితిన్ నవీన్‌ పోటీలో నిలిచారు. బట్కీపూర్ అసెంబ్లీ స్థానం పాట్నా సాహిబ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2009, 2014 లో రెండుసార్లు శత్రుఘన్ సిన్హాను బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నుకున్నారు.

Updated Date - 2020-10-25T13:57:12+05:30 IST