కరోనా కోరల్లో బెంగాల్.. నేడు ఏకంగా 2,200పైగా..

ABN , First Publish Date - 2020-07-20T02:40:30+05:30 IST

బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 1500కు అటుఇటుగా ...

కరోనా కోరల్లో బెంగాల్.. నేడు ఏకంగా 2,200పైగా..

కలకత్తా: బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 1500కు అటుఇటుగా నమోదవుతున్న కేసులు నేడు ఏకంగా 2200 దాటేశాయి. దీనికి తోడు మరణాలు కూడా కొద్దిగగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతుండడంతో మొత్తం కేసులు కూడా ప్రభావం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 42వేలు దాటేసింది. ఇదిలా ఉంటే అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 36 మంది మరణించారు. 1,344మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 42,487కు చేరింది. వీరిలో 16,492మంది చికిత్స పొందుతుండగా 24,883మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1,112మంది మృత్యువాతపడ్డారు.



Updated Date - 2020-07-20T02:40:30+05:30 IST