బెంగాల్‌లో 16వేలకు చేరువలో కరోనా కేసులు.. 600 దాటిన మరణాలు

ABN , First Publish Date - 2020-06-26T01:49:22+05:30 IST

బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో 470కి పైగా పాజిటివ్ కేసులు...

బెంగాల్‌లో 16వేలకు చేరువలో కరోనా కేసులు.. 600 దాటిన మరణాలు

కలకత్తా: బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో 470కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 16వేలకు చేరువకాగా మరణాల సంఖ్య 600 దాటింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 475 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది మరణించారు. 488మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,648కి చేరింది. వీరిలో 4,852మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 10,190మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 606మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-26T01:49:22+05:30 IST