బాలల హక్కుల ప్రచారానికి ఆయుష్మాన్ ఖురానా
ABN , First Publish Date - 2020-09-12T07:44:02+05:30 IST
‘ఫర్ ఎవ్రీ చైల్డ్’ పేరిట బాలల హక్కుల కోసం చేపడుతున్న క్యాంపెయి న్కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను నియమించుకున్నట్టు యునిసెఫ్ ఇండి యా శుక్రవారం ప్రకటించింది.

యునిసెఫ్ ఇండియా వెల్లడి
ముంబై, సెప్టెంబరు 11: ‘ఫర్ ఎవ్రీ చైల్డ్’ పేరిట బాలల హక్కుల కోసం చేపడుతున్న క్యాంపెయి న్కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను నియమించుకున్నట్టు యునిసెఫ్ ఇండి యా శుక్రవారం ప్రకటించింది. దేశంలో పిల్లలపై హింసను అంతమొందించేందుకు యునిసెఫ్ చేస్తున్న ప్రయత్నానికి ఖురానా సహకారం అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ ప్రచారానికి మాజీ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హాం సహకారం అందిస్తున్నారు. పిల్లలపై హింసను తగ్గించే అంశంపై అవగాహన కల్పించేందుకు ఖురానా మద్దతు ఎంతగానో దోహదపడుతుందని భారత్లో యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ అలీ హక్ తెలిపారు.