వచ్చే నెల 1 నాటికి ‘ఆత్మ నిర్భర్ మధ్య ప్రదేశ్’ రోడ్ మ్యాప్ : శివరాజ్ సింగ్ చౌహాన్
ABN , First Publish Date - 2020-08-15T03:45:44+05:30 IST
‘ఆత్మ నిర్భర్ మధ్య ప్రదేశ్’ రోడ్ మ్యాప్ను సెప్టెంబరు 1 నాటికి ఖరారు చేస్తామని
భోపాల్ : ‘ఆత్మ నిర్భర్ మధ్య ప్రదేశ్’ రోడ్ మ్యాప్ను సెప్టెంబరు 1 నాటికి ఖరారు చేస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆయన నేతృత్వంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయనే సాకుతో మనం దిగాలుపడిపోకూడదని చెప్పారు.
‘ఆత్మ నిర్భర్ మధ్య ప్రదేశ్’ రోడ్ మ్యాప్ కోసం ఆగస్టు 25లోగా సలహాలు ఇవ్వాలని మంత్రులను శివరాజ్ కోరారు. కోవిడ్-19 మహమ్మారి అనంతరం నిర్వహించవలసిన కార్యక్రమాలను సెప్టెంబరు 1 నాటికి ఖరారు చేస్తామని తెలిపారు. డబ్బుల్లేవని బీద అరుపులు అరిచే ముఖ్యమంత్రిని తాను కానని తెలిపారు. డబ్బుల్లేకపోతే, తాను ఏర్పాటు చేస్తానన్నారు. తాను తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదని చెప్పారు.