ట్రంప్ను స్వాగతించిన కళాకారులకు ఎట్టకేలకు పారితోషికం
ABN , First Publish Date - 2020-05-09T16:20:12+05:30 IST
ఈ ఏడాది ఫిబ్రవరి 24 న యూపీలోని ఆగ్రాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికిన రాష్ట్ర జానపద కళాకారులకు ఎట్టకేలకు గౌరవ పారితోషికం అందనుంది. జానపద కళాకారుల...
ఆగ్రా: ఈ ఏడాది ఫిబ్రవరి 24 న యూపీలోని ఆగ్రాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికిన రాష్ట్ర జానపద కళాకారులకు ఎట్టకేలకు గౌరవ పారితోషికం అందనుంది. జానపద కళాకారుల పారితోషికం విషయమై పలు వార్తలు వచ్చిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ నేపధ్యంలో ట్రంప్ను స్వాగతించిన 15 బృందాలకు చెందిన 350 మంది కళాకారుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఆ కళాకారులకు గౌరవం పారితోషికం చెల్లించేందుకు రూ. 50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కళాకారుడి ఖాతాలో రూ. 2 నుంచి 3 వేల రూపాయలు జమ చేయనున్నారని సమాచారం.