మెట్రోకు ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు
ABN , First Publish Date - 2020-09-03T08:25:34+05:30 IST
మెట్రో రైలు ప్రయాణికులు ఆరోగ్యసేతు యాప్ను తప్పని సరిగా కలిగి ఉండాలనే నిబంధనను తొలగించే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి దేశ వాప్తంగా మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే...

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: మెట్రో రైలు ప్రయాణికులు ఆరోగ్యసేతు యాప్ను తప్పని సరిగా కలిగి ఉండాలనే నిబంధనను తొలగించే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి దేశ వాప్తంగా మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో విధివిధానాల ఖరారుపై అన్ని మె ట్రో రైలు కార్పొరేషన్ల ఎండీలతో కేంద్రం సమావేశా న్ని నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఆరోగ్యసేతు త ప్పని సరి వల్ల స్మార్ట్ఫోన్ లేనివారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఎండీలు అభిప్రాయపడ్డారు.