భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ...కల్నల్ సహా ఇద్దరు జవాన్ల మృతి

ABN , First Publish Date - 2020-06-16T19:00:34+05:30 IST

భారత, చైనా సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు.....

భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ...కల్నల్ సహా ఇద్దరు జవాన్ల మృతి

లడఖ్ : భారత, చైనా సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత,  చైనా సైనిక బలగాల మధ్య హింసాత్మక దాడికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. నెలన్నర రోజులుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా దళాలు మోహరించి ఉన్నాయి. గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సోలోని నియంత్రణ రేఖ వద్ద చైనా సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. చైనా సైనికులు సరిహద్దుల్లో ఉనికిని పెంచుకున్న నేపథ్యంలో భారత సైనిక దళాలు, వాహనాలు, ఫిరంగి తుపాకులను తూర్పు లడఖ్‌కు పంపించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-06-16T19:00:34+05:30 IST