అప్రెంటిస్లకు పూర్తి భృతి: కేంద్రం
ABN , First Publish Date - 2020-04-01T08:44:19+05:30 IST
దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అప్రెంటి్సలందరికీ లాక్డౌన్ సమయంలోనూ పూర్తిస్థాయి భృతి అందిస్తామని కేంద్ర సర్కారు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులపై...

న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అప్రెంటి్సలందరికీ లాక్డౌన్ సమయంలోనూ పూర్తిస్థాయి భృతి అందిస్తామని కేంద్ర సర్కారు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులపై సమీక్ష, స్వచ్ఛంద పదవీ విరమణ విజ్ఞప్తికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై ప్రక్రియను ఉన్నతాధికారులు గడువులోపే ముగించాల్సి ఉంటుంది. అయితే, లాక్డౌన్ విధించిన 21 రోజుల సమయాన్ని ఆ గడువులోంచి మినహాయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వివరించింది. మార్చి 31న పదవీ విరమణ చేయాల్సిన వారందరూ ఇక తమ విధుల్లోంచి తప్పుకోవాలని చెప్పింది.