ఏపీ సీఎం జగన్ లేఖను ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్
ABN , First Publish Date - 2020-10-17T16:49:16+05:30 IST
ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. సీజేకు రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని
ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. సీజేకు రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొంది. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం అసంబద్ధమని తెలిపింది. న్యాయసూత్రాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణకు, స్వతంత్రతకు.. జగన్ తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న జగన్.. ఇటువంటి చర్యలు చేయడం హేయమన్నారు.