సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష : అన్నా హజారే
ABN , First Publish Date - 2020-12-28T19:47:51+05:30 IST
నూతన సంవత్సరం జనవరి నాటికి రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. లేని

పూణె : నూతన సంవత్సరం జనవరి నాటికి రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని, అదే చివరి నిరసన అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. గత మూడేళ్లుగా రైతులు నిరసన చేస్తూనే ఉన్నారని, అయినా ప్రభుత్వం వాటిని పరిష్కరించలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం ఖాళీ వాగ్దానాలను ఇస్తోంది. అందువల్ల నాకు వాటిపై నమ్మకం లేదు. నా డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం నెల వ్యవధి అడిగింది. అందుకే నేను జనవరి వరకూ సమయం ఇచ్చా. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే నేను నిరాహార దీక్షకు దిగుతా. అదే నా చివరి నిరసన దీక్ష అవుతుంది.’’ అని అన్నా హజారే హెచ్చరించారు.