పాక్‌లో పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-07-20T08:02:18+05:30 IST

ఇంటి నిర్మాణం కోసం పునాదులు తొవ్వుతుండగా ఓ పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. అయితే, చాలా అరుదైన ఆ విగ్రహాన్ని ఇంటి నిర్మాణ కార్మికులు ఉద్దేశపూర్వకంగా ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు...

పాక్‌లో పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం

  • ఇంటి నిర్మాణ పనుల్లో బయటపడగా దుశ్చర్య

న్యూఢిల్లీ, జూలై 19: ఇంటి నిర్మాణం కోసం పునాదులు తొవ్వుతుండగా ఓ పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. అయితే, చాలా అరుదైన ఆ విగ్రహాన్ని ఇంటి  నిర్మాణ కార్మికులు ఉద్దేశపూర్వకంగా ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రం మర్ధాన్‌ జిల్లాలోని త ఖ్త్‌ బాహి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విగ్రహం ఇస్లాం మతానికి విరుద్ధమంటూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. ఆ విగ్రహం బయటపడిన ప్రాంతం ఒకప్పుడు గాంధార నాగరికతకు చెందినదని, ఆ విగ్రహం దాదాపు 1,700 ఏళ్ల క్రితం నాటిదని అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-07-20T08:02:18+05:30 IST