అమృత్సర్లో కీచకపర్వం
ABN , First Publish Date - 2020-11-22T10:03:17+05:30 IST
అమృత్సర్లో కీచకపర్వం చోటుచేసుకుంది. గురుద్వార షాహీదాన్ సాహిబ్ సందర్శనకు వచ్చిన ఒంటరి మహిళపై ఆరుగురు
అమృత్సర్, నవంబరు 21: అమృత్సర్లో కీచకపర్వం చోటుచేసుకుంది. గురుద్వార షాహీదాన్ సాహిబ్ సందర్శనకు వచ్చిన ఒంటరి మహిళపై ఆరుగురు అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం వేట సాగిస్తున్నారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఓ మహిలను అత్తారి-వాఘా సరిహద్దు వరకు తీసుకెళ్లి దింపుతానని నమ్మించిన యువరాజ్ సింగ్ ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.