జేపీ నడ్డా బదులు రంగంలోకి అమిత్‌షా

ABN , First Publish Date - 2020-10-31T18:33:31+05:30 IST

వచ్చే నెల 5 న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు

జేపీ నడ్డా బదులు రంగంలోకి అమిత్‌షా

న్యూఢిల్లీ : వచ్చే నెల 5 న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు కార్యక్రమాల ప్రకారం ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ... శుక్రవారం రాత్రి ఉన్నట్లుండి బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. స్థానిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ప్రస్తుత తరుణంలో అమిత్‌షా పర్యటిస్తేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘‘ప్రస్తుతానికి జేపీ నడ్డా పర్యటన వాయిదా పడింది. నవంబర్ 5 నుంచి రెండు రోజుల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ పర్యటనకు రానున్నారు.’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు ప్రకటించారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కార్యక్షేత్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ నిర్మాణం... తదితర సంఘటన పరిస్థితులపై షా సుదీర్ఘ భేటీ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


మొదటి రోజు అత్యంత కీలకమైన మేధినీపూర్ లో షా పర్యటిస్తారని, కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తారని పార్టీ పేర్కొంది. అయితే రెండో పర్యటన వివరాలపై తుది నిర్ణయం తీసుకోలేదని నేతలు తెలిపారు. ఈ పర్యటనలో షా పూర్తిగా ‘బూత్ సంఘటన’ పై దృష్టి సారిస్తారని, కార్యక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ ఉంటుందని ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ ప్రకటించారు. 

Updated Date - 2020-10-31T18:33:31+05:30 IST