శభాష్‌ అక్షయ్‌

ABN , First Publish Date - 2020-03-29T08:05:34+05:30 IST

కరోనా నియంత్రణ చర్యల కోసం ప్రధాని సహాయ నిధికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ‘‘ప్రజల జీవితాలను కాపాడుకోవాల్సిన సమయం ఇది.

శభాష్‌ అక్షయ్‌

కరోనాపై పోరుకు రూ.25 కోట్ల విరాళం

అంత మొత్తమా... ఆలోచించే ఇస్తున్నావా?

ఆశ్చర్యంగా అడిగిన సతీమణి ట్వింకిల్‌

నన్ను ఈ స్థాయికి తెచ్చిన వాళ్లకే 

తిరిగి ఇస్తున్నానన్న ‘రియల్‌ హీరో’


న్యూఢిల్లీ, మార్చి 28: కరోనా నియంత్రణ  చర్యల కోసం ప్రధాని సహాయ నిధికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌  రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ‘‘ప్రజల జీవితాలను కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఎవరికి తోచిన సాయం వారు చేయాలి’’ అని ఆయన ట్వీట్‌ చేయగా భార్య ట్వింకిల్‌ ఖన్నా స్పందించారు. ‘‘అంతమొత్తమా.. ఆలోచించే ఇస్తున్నావా’’ అని ఆమె ప్రశ్నించగా.. ‘‘నన్ను ఈస్థాయికి తెచ్చినవాళ్లకే తిరిగి ఇస్తున్నా’’ అని అక్షయ్‌ బదులిచ్చారు. 

Updated Date - 2020-03-29T08:05:34+05:30 IST