యోగి సర్కారు నిర్ణయంపై అఖిలేష్ సెటైర్లు
ABN , First Publish Date - 2020-05-24T20:59:35+05:30 IST
లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని

లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆసుపత్రుల్లో చేరే పేషంట్లు ఇకపై వార్డుల్లోకి వెళ్లక ముందే మొబైల్ ఫోన్లను వార్డు ఇంఛార్జికి అప్పగించాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఫోన్లను తిరిగి అప్పగిస్తారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఇన్ఫెక్షన్ సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో ఉంది.
మరోవైపు యోగి సర్కారు నిర్ణయంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. వాస్తవానికి చేయాల్సింది శానిటేషన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైఫల్యాలు బయటపడతాయనే భయంతోటే సర్కారు మొబైల్ ఫోన్లను నిషేధించిందని అఖిలేష్ ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆరంభం నుంచే కోవిడ్ వార్డుల్లోకి మోబైల్ ఫోన్లను అనుమతించడం లేదు.