వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న విమానం విండ్ షీల్డు...

ABN , First Publish Date - 2020-03-04T17:11:36+05:30 IST

కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగివచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు....

వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న విమానం విండ్ షీల్డు...

  • ఎయిర్ ఆసియా విమానం అత్యవసర ల్యాండింగ్

కోల్‌కతా : కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగివచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం 15-536 నంబరు గల ఎయిర్ ఆసియా విమానం 170 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కురిసిన వడగళ్ల వర్షంతో విమానం విండ్ షీల్డు దెబ్బతింది. దీంతో పైలెట్ విమానాన్ని తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికే వచ్చి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి అరూప్ బిశ్వాస్ ఉన్నారు. ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే వడగళ్ల వర్షం వల్ల విమానం కుదుపులకు గురైందని, దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారని మంత్రి అరూప్ బిశ్వాస్ చెప్పారు. వడగళ్ల వర్షంతోపాటు వాతావరణం అనుకూలించక పోవడంతో కోల్‌కతా విమానాశ్రయం నుంచి పలు విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. 

Updated Date - 2020-03-04T17:11:36+05:30 IST