సబర్మతీ ఆశ్రమంలో అణువణువూ తనిఖీ
ABN , First Publish Date - 2020-02-13T04:23:17+05:30 IST
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమంలో భారీగా తనిఖీలు చేపట్టారు.
![సబర్మతీ ఆశ్రమంలో అణువణువూ తనిఖీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021210484181/02122020225248n42.jpg)
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమంలో భారీగా తనిఖీలు చేపట్టారు. తన పర్యటనలో భాగంగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శించనున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్తో పాటు భద్రతా సిబ్బంది ఆశ్రమంలోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రంప్ దంపతులు ఈ నెల 24న తొలుత అహ్మదాబాద్ రానున్నారు. ఈ నెల 25న ఢిల్లీకి చేరుకుంటారు.