జర్నలిస్టులూ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి...

ABN , First Publish Date - 2020-04-21T13:10:49+05:30 IST

ముంబై నగరంలో 50 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సలహా ఇచ్చారు.....

జర్నలిస్టులూ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి...

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి సలహా

ముంబై : ముంబై నగరంలో 50 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సలహా ఇచ్చారు. దేశంలో వార్తాపత్రికలు, టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా సోకకుండా తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 50 మంది జర్నలిస్టులు, ముఖ్యంగా కెమెరామెన్ లు ముంబైలో కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడం ఆశ్చర్యకరం. విధినిర్వహణలో ప్రతీ జర్నలిస్ట్ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని కేంద్రమంత్రి జవదేకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్‌లో కోరారు. వార్తాపత్రికలు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 


Updated Date - 2020-04-21T13:10:49+05:30 IST