విగతజీవిగా పడి ఉన్న చిరుతపులి.. మెడపై బుల్లెట్ గాయం
ABN , First Publish Date - 2020-06-20T00:33:50+05:30 IST
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సిమ్లా రూరల్లోని...
![విగతజీవిగా పడి ఉన్న చిరుతపులి.. మెడపై బుల్లెట్ గాయం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020061906591351/06192020190313n38.jpg)
హీరానగర్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సిమ్లా రూరల్లోని హీరానగర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి విగత జీవిగా పడి ఉన్నట్లు అటవీ శాఖ స్థానిక అధికారులు గుర్తించారు. చిరుతపులి కళేబరాన్ని పోస్ట్మార్టంకు తరలించగా మెడ మీదుగా బుల్లెట్ దూసుకెళ్లినట్లు తేలింది.
వేటగాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాన్ని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఘటనపై విచారణ ప్రారంభించారు. ఒడిశాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా వెలుగుచూసింది. ఓ ఏనుగును వేటగాళ్లు బుల్లెట్తో కాల్చడంతో మృతి చెందింది. ఇలా మూగజీవాలను పాశవికంగా చంపుతుండటంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.