పశ్చిమ బెంగాల్లో 9 నెలల పసికందుకు కరోనా.. ఆ కుటుంబంలోని మరో నలుకురికీ పాజిటివ్
ABN , First Publish Date - 2020-03-28T20:39:52+05:30 IST
దేశంలో నానాటికీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు...
![పశ్చిమ బెంగాల్లో 9 నెలల పసికందుకు కరోనా.. ఆ కుటుంబంలోని మరో నలుకురికీ పాజిటివ్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032803044295/03282020151527n69.gif)
పశ్చిమ బెంగాల్: దేశంలో నానాటికీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి. అయినా కరోనా ధాటిని అరికట్టడంలో సఫలీకృతం కాలేకపోతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమ బెంగాల్లో 9 నెలల పసికందు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారి ధృవీకరించారు. అంతేకాకుండా ఆ కుటుంబంలోని మిగిలిన నలుగురికి కూడా కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆ అధికారి వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని వివరించారు.
ఒకేసారి 5 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 15కు పెరిగిందని వైద్యాధికారి తెలిపారు.