ఒడిశాలో కరోనా నుంచి కోలుకున్న వృద్ధ దంపతులు
ABN , First Publish Date - 2020-07-19T16:09:09+05:30 IST
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో క్యాన్సర్ బాధితుడు(85), అతని భార్య(78) కోవిడ్ -19 నుంచి కోలుకున్నారు. వైద్యాధికారులు ఈ సమాచారం మీడియాకు తెలియజేశారు. కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ వర్మ....
![ఒడిశాలో కరోనా నుంచి కోలుకున్న వృద్ధ దంపతులు](https://media.andhrajyothy.com/appimg/galleries/202007190503914/07192020103858n83.gif)
కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో క్యాన్సర్ బాధితుడు(85), అతని భార్య(78) కోవిడ్ -19 నుంచి కోలుకున్నారు. వైద్యాధికారులు ఈ సమాచారం మీడియాకు తెలియజేశారు. కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ వర్మ మాట్లాడుతూ సురేంద్ర పాల్, అతని భార్య సావిత్రి కరోనా నుంచి విముక్తి పొంది, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సురేంద్ర పాల్ గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేస్తూ ... వారు ఈ వ్యాధిని ఓడించడంలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. వారికి శుభాకాంక్షలు. అని రాశారు. కీమోథెరపీ కోసం సురేంద్ర పాల్ను జూన్ 8 న కటక్లోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంలో చేర్పించామని, అతని సంరక్షణ కోసం భార్య ఆసుపత్రిలో ఉండేవారిని కేంద్రపారా అదనపు జిల్లా వైద్య అధికారి ఎంహెచ్ బేగ్ తెలిపారు. అయితే జూన్ 29న వీరిద్దరూ కోవిడ్ -19 బారిన పడ్డారని, దీంతో వీరిని కటక్లోని కోవిడ్ -19 ఆసుపత్రికి తరలించామన్నారు. పది రోజుల చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారని బేగ్ చెప్పారు.