కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు
ABN , First Publish Date - 2020-07-06T08:19:54+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని మోదీనగర్లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. పుట్టిన రోజుకు వినియోగించే మెరుపులతో మండే కొవ్వొత్తులు తయారు చేస్తుండగా...
- ఏడుగురి మృతి.. యూపీలో ఘటన
ఘజియాబాద్, జూలై 5: ఉత్తరప్రదేశ్లోని మోదీనగర్లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. పుట్టిన రోజుకు వినియోగించే మెరుపులతో మండే కొవ్వొత్తులు తయారు చేస్తుండగా పేలుడు పదార్థాలకు నిప్పంటుకుని ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. మరణించిన వారికి రూ.4లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.