కోవిడ్ ఆసుపత్రిగా మారిన కామన్వెల్త్ గేమ్స్ విలేజ్
ABN , First Publish Date - 2020-07-09T03:28:28+05:30 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ ఆసుపత్రిగా మారింది. తూర్పు ఢిల్లీ వాసులకు సేవలందించే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ ఆసుపత్రిగా మారింది. తూర్పు ఢిల్లీ వాసులకు సేవలందించే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మొత్తం 550 పడకలు ఇందులో ఉన్నాయి. స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో ఇటీవలే పదివేల బెడ్స్ సామర్థ్యమున్న ఆసుపత్రిని ప్రారంభించారు.