మహారాష్ట్రలో కరోనా మారణహోమం.. ఒక్కరోజులో 48 మరణాలు

ABN , First Publish Date - 2020-05-10T02:45:31+05:30 IST

దేశంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా మారణహోమం...

మహారాష్ట్రలో కరోనా మారణహోమం.. ఒక్కరోజులో 48 మరణాలు

ముంబై: దేశంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా మారణహోమం సృష్టిస్తోంది. ఒక్కరోజులో దాదాపు 50మంది మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు 11వందలకు పైగా కొత్త కేసులు ఈ రోజు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం, గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యప్తంగా 1,165 కేసులు నమోదయ్యాయి. 48 మంది మృత్యువాత పడ్డారు. 330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,228కి చేరింది. 779 మంది మరణించారు. మొత్తం 3,800 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇంకా 16,428 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇదిలా ఉంటే మొత్తం 20,228 కేసుల్లో రాజధాని ముంబైలోనే 12,864 కేసులు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తం 779 మరణాల్లో 489 మరణాలు కూడా ముంబై పరిధిలోనే సంభవించాయని వెల్లడించారు.

Updated Date - 2020-05-10T02:45:31+05:30 IST