45% దక్షిణాది వారే తాగేస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-05-09T09:21:55+05:30 IST

దేశంలో మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని క్రిసిల్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక

45% దక్షిణాది వారే తాగేస్తున్నారు..!

ముంబై, మే 8: దేశంలో మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని క్రిసిల్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాల ఆదాయ వనరులు మూసుకుపోయినా.. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వల్ల పుంజుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. దేశం మొత్తంలో 45% మద్యం వినియోగం దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే జరుగుతుందని తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ఆదాయంలో 10-15% వాటా మద్యం ద్వారానే వస్తుందని వివరించింది. 

Updated Date - 2020-05-09T09:21:55+05:30 IST