మహారాష్ట్రను వదలని కరోనా.. ఇవాళ కూడా..

ABN , First Publish Date - 2020-06-23T03:22:42+05:30 IST

భారత్‌లో మహారాష్ట్ర కరోనా హాట్‌‌స్పాట్‌గా మారింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలోనే...

మహారాష్ట్రను వదలని కరోనా.. ఇవాళ కూడా..

ముంబై: భారత్‌లో మహారాష్ట్ర కరోనా హాట్‌‌స్పాట్‌గా మారింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ఇవాళ మహారాష్ట్రలో కొత్తగా 3721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.


దీంతో.. మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 135796కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 61793. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 67,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బారిన పడిన వారిలో ఇవాళ మహారాష్ట్రలో 62 మంది మరణించారు. దీంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6283కు చేరింది.

Updated Date - 2020-06-23T03:22:42+05:30 IST