విదేశాల నుంచి వచ్చిన 361 మంది ముంబైలో క్వారంటైన్...

ABN , First Publish Date - 2020-12-30T05:00:42+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన 361 మంది ముంబైలో క్వారంటైన్...

విదేశాల నుంచి వచ్చిన 361 మంది ముంబైలో క్వారంటైన్...

ముంబై: విదేశాల నుంచి వచ్చిన 361 మందికి ముంబైలో క్వారంటైన్ విధించారు. మొత్తం 664 మంది విదేశాల నుంచి వచ్చారనీ.. ఇందులో 361 మందిని క్వారంటైన్‌ తరలించామని స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు. నిన్న ముంబైలో మొత్తం 9 విదేశీ విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఇందులో 254 మంది ప్రయాణికులకు వివిధి జిల్లాలు వెళ్లేందుకు అనుమతి లభించగా... వయసు సహా పలు కారణాల రీత్యా కొంత మందిని తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయించారు. కాగా యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్‌‌ను గుర్తించిన నేపథ్యంలో ఆదివారం ఈయూ, మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే విమానాలకు సంబంధించిన ప్రొటోకాల్ నిబంధనలను అధికారులు సవరించారు. ఈ నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి. దీంతో పాటు మరో ఏడు రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటించాలి. కాగా ఇంతకు ముందు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ వ్యవధి 14 రోజులుగా ఉంది. 

Updated Date - 2020-12-30T05:00:42+05:30 IST