మాస్కు ధరించనందుకు 32 మందిపై ఎఫ్ఐఆర్
ABN , First Publish Date - 2020-04-11T00:12:05+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కేసులు...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు వచ్చేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించాల్సిందిగా రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 32 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.