చెన్నైలోని హై సెక్యూరిటీ జైల్లోని 30 ఖైదీలకు కరోనా
ABN , First Publish Date - 2020-05-30T03:50:40+05:30 IST
తమిళనాడు రాజధాని చెన్నైలోని హైసెక్యురిటీ పుళల్ సెంట్రల్ జైల్లోని 30 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కడ్డలూర్ ట్రిచీ జైల్ల ఖైదీలకు సమీపంలోకి వచ్చిన 90 మంది పుళల్ ఖైదీల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా సోకినట్టు తేలింది.

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని హైసెక్యురిటీ పుళల్ సెంట్రల్ జైల్లోని 30 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కడ్డలూర్ ట్రిచీ జైల్ల ఖైదీలకు సమీపంలోకి వచ్చిన 90 మంది పుళల్ ఖైదీల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో వీరిని అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మిగతా ఖైదీలను క్వారంటైన్ చేశారు. వారి ఆరోగ్య స్థితి జైలు అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కాగా.. తమిళనాడులో గత 24 గంటల్లో 874 కొత్త కేసులు నమోదవగా అందులో 618 కేసులు చెన్నైలోనే వెలుగు చూశాయి. అంతే కాకుండా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు 800 వందల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయిందని అధికారులు తెలిపారు.